జనాలనే కాష్టలను పేర్చి ప్రాంతీయ భేధాలనే మంట రగిల్చి వెచ్చ వెచ్చ గా చలి కాగుతున్నారు చలి మంట కాస్తా పెనుమంట గా మారి మిమ్ములనందరినీ భస్మీపటలం చేస్తుంది - జాగ్రత్త
దేశ భక్తి వృత్తి లో ప్రాణాలు కోల్పోయిన శ్రీధర్ , కరుణాకర్ రూపంలో నిలువెత్తున నిలిచింది వారికి అందరం చేతులెత్తి సలాం చేయాలి పోరాడే వాడికి ఓటమి లేదు ప్రజల గుండెల్లో నిలిచిపోతారు ( స్మగ్లర్ల దాడి లో అశువులు బాసిన ఫారెస్ట్ అధికారులకు ఘన నివాళి )
ఎవరు చెప్పారు కనులు తెరిస్తే జననం అని కనులు మూస్తే మరణం అని క్షణకాలం ఈ జీవితం అని ఎన్ని కోట్ల అడుగులు నడవాలి ఎన్ని లక్షల మైళ్ళు ప్రయాణం చేయాలి ఎనేన్ని దశల దాటి దశాబ్దాల తరబడి సాగాలి ఎన్నెన్నో పున్నమలు , ఎన్నో అమావాస్యలు చూడాలి ఇంత గొప్ప ప్రయాణాన్ని యెంతో ప్రయోజనకరంగా మార్చుకో..... !!
రుద్ర భూమి ఇచ్చోటనే కదా పెద్దలు విశ్రమించేది ఇచ్చోటనే కదా బాధ్యతల బరువు తెగేది ఇచ్చోటనే కదా అవిశ్రాంత విశ్రాంతి దొరికేది ఇచ్చోటనే కదా ప్రధమ గణనాధులు తిరిగేది ఎందుకు వెరపు ఈ వైపు కన్నేతి చూడటానికి ఆపై ఎలాగు కన్నులు తెరిచి చూడలేవు ఈ సుందర దృశ్యం అగ్ని తన పరిష్వంగంతో మన దేహాలను పరమ పవిత్రం చేసే ...
బేడీలు నను బంధిచాయి ప్రజల హృదయాలతో చెరసాలలు అయ్యాయి బారసాలలు నా దేశం ప్రేమలో గాంధీ స్పూర్తి పోసింది అహింస ఊపిరి యెదలో పిడికిలి బిగించాను జాతి వివక్షపై తిరుగులేని పోరాటం నేను ,నెల్సన్ మండేలాను - ఎర్రగా మండే నల్ల జాతి సూర్యుడిని భారత రత్నతో ఘన నివాళి మా దత్త పుత్రునికి - నెల్సన్ మండేలాకు